హైదరాబాద్ : శంషాబాద్ పరిధిలోని ముచ్చింతల్లో సమతా ప్రతిమ (స్టాచూ ఆఫ్ ఈక్వాలిటీ) ఆవిష్కరణ మహోత్సవానికి విచ్చేయాలని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడుని త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామి కోరారు. మంగళవారం చినజీయర్ స్వామి ఢిల్లీలోని ఉప రాష్ట్రపతి నివాసంలో వెంకయ్యనాయుడిని కలిశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రతిమను ఆవిష్కరించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ ఆవిష్కరణ మహోత్సవానికి రావాల్సిందిగా ఆహ్వానాన్ని అందజేశారు.