న్యూఢిల్లీ: ఆస్తుల విలువపరంగా చూస్తే ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశంగా చైనా మొదటి స్థానంలో ఉన్నదని, అమెరికాను దాటేసిందని మెకెన్సీ అండ్ కో పరిశోధన సంస్థ వెల్లడించింది. 2000వ సంవత్సరంలో చైనా ఆస్తుల విలువ 7 ట్రిలియన్ డాలర్లు ఉండగా.. 2020 నాటికి అది 120 ట్రిలియన్ డాలర్లకు పెరిగింది. 20 ఏండ్లలో చైనా ఆస్తుల విలువ 113 ట్రిలియన్ డాలర్లు పెరిగింది. అమెరికా ఆస్తుల విలువ 2020 నాటికి 90 ట్రిలియన్ డాలర్లే. అంటే అమెరికా కన్నా చైనా ఆస్తుల విలువ 23 ట్రిలియన్ డాలర్లు ఎక్కువన్నమాట.
మెకెన్సీఅండ్కో తన నివేదిక కోసం 10 సంపన్న దేశాల ఆస్తుల విలువలను పరిశీలించింది. ప్రపంచంలోని మొత్తం సంపదతో పోలిస్తే ఈ 10 దేశాల్లోనే 60% ఆస్తులు ఉన్నాయని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా అన్నిదేశాల ఆస్తుల విలువ 2000లో 156ట్రిలియన్ డాలర్లు ఉండ గా.. 2020 నాటికి 514 ట్రిలియన్ డాలర్లకు పెరిగింది. అంటే గడిచిన 20ఏండ్లలో ప్రపంచ ఆస్తుల విలువ 3రెట్లు పెరిగింది. మొత్తం ఆస్తుల్లో రియల్ఎస్టేట్ వాటానే 68శాతం కాగా, మిగతావి యంత్రా లు, మౌలికసదుపాయాల రూపంలో ఉన్నాయి. నగదు, బ్యాంకు డిపాజిట్లు, బాండ్లు, మ్యూచువల్ ఫండ్లను ఈ లెక్కలోకి తీసుకోలేదు.