బీజింగ్, అక్టోబర్ 13: అరుణాచల్ ప్రదేశ్లో ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు పర్యటనపై చైనా బుధవారం అభ్యంతరం వ్యక్తం చేసింది. అరుణాచల్ ప్రదేశ్ దక్షిణ టిబెట్లో భాగమని వాదించే చైనా.. ఆ రాష్ట్రంలో భారత నాయకులు ఎవరు పర్యటించినా వ్యతిరేకిస్తుంటుంది. వెంకయ్యనాయుడు ఈ నెల 9న అరుణాచల్ ప్రదేశ్లో పర్యటించారు. ఆ రాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలను ఉద్దేశించి ప్రసంగించారు. కాగా, చైనా అభ్యంతరానికి భారత్ దీటుగా బదులిచ్చింది. అరుణాచల్ ప్రదేశ్ భారత్లో అంతర్భాగమని స్పష్టం చేసింది.