బీజింగ్, డిసెంబర్ 7: కరోనా నియంత్రణ కోసం తీసుకొచ్చిన ‘జీరో కొవిడ్’ పాలసీపై తీవ్ర వ్యతిరేకత రావడంతో చైనా వెనక్కి తగ్గింది. కరోనా ఆంక్షలను సడలించింది.
ఇప్పటి వరకు అమల్లో ఉన్న జిల్లావ్యాప్త లాక్డౌన్ను అపార్టుమెంట్లు, బిల్డింగ్లకు పరిమితం చేసింది. జీరో కొవిడ్ పాలసీని దాదాపుగా రద్దు చేసే అంతగా ఆంక్షలను సడలించింది. అయితే ఇలా ఆంక్షలు సడలించడం వల్ల కేసులు పెరిగే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.