హైదరాబాద్, నవంబర్11 (నమస్తే తెలంగాణ)/గద్వాల : గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి తండ్రి వెంకట్రామిరెడ్డి (82) గురువారం మృతిచెందారు. కొద్ది రోజులుగా గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని ఓ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. గురువారం దవాఖాన నుంచి డిశ్చార్జి అయి ఇంటికి వెళ్లాక తిరిగి అస్వస్థతకు గురయ్యారు. వెంటనే కుటుంబ సభ్యులు దవాఖానకు తరలించగా అప్పటికే మృతి చెందినట్టు డాక్టర్లు తెలిపారు.
వెంకట్రామిరెడ్డి మృతిపట్ల ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సంతాపం వ్యక్తంచేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్ సంతాపం తెలిపారు. వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి, అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం తదితరులు ఎమ్మెల్యేను పరామర్శించి, ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చా రు. శుక్రవారం ఉదయం 10 గంటలకు ఆయన సొంతూరు జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండలంలోని బూరెడ్డిపల్లిలో అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్టు కుటుంబసభ్యులు తెలిపారు.