చెన్నై: ప్రతిష్ఠాత్మక చెస్ ఒలింపియాడ్కు సంబంధించి కౌంట్డౌన్ ప్రారంభమైంది. చెన్నై వేదికగా జూలై 28 నుంచి ప్రారంభమయ్యే 44వ చెస్ ఒలింపియాడ్ కౌంట్డౌన్ను ప్రపంచ మాజీ చాంపియన్, భారత చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ సోమవారం ప్రారంభించాడు.
ఈ టోర్నీ యువ ఆటగాళ్లకు జీవితకాల అవకాశమని తెలిపారు. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఉక్రెయిన్పై యుద్ధం కారణంగా రష్యాలోని మాస్కో వేదికగా జరుగాల్సిన ఈ టోర్నీ భారత్కు చేరిన విషయం తెలిసిందే.