ఐపీఎల్ 14వ సీజన్… రెండో దశ ప్రారంభం అయింది. ప్రారంభం కావడమే.. రెండు టఫ్ జట్ల మధ్య మ్యాచ్తో ప్రారంభం కావడంతో.. ఐపీఎల్ ప్రేక్షకులు మొదటి మ్యాచ్ను మిస్ కాకుండా చూస్తున్నారు. తొలి పోరులో ముంబై, చెన్నై మధ్య మ్యాచ్ ప్రారంభం అయింది. దుబాయ్లోని ఇంటర్నేషన్ క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్.. బ్యాటింగ్ ఎంచుకొని రంగంలోకి దిగింది.
మొత్తం 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి చెన్నై 156 పరుగులు చేసి ముంబైకి 157 పరుగుల లక్ష్యాన్ని అందించింది.
ఇక.. చెన్నై ఆటగాళ్లలో రుతురాజ్ గైక్వాడ్.. జట్టుకు ఎక్కువ పరుగులు అందించాడు. 58 బంతుల్లో 88 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోర్ను అందించాడు. రవీంద్ర జడేజా.. 33 బంతుల్లో 26 పరుగులు, బ్రావో.. 8 బంతుల్లో 23 పరుగులు చేశారు.
ముంబై బౌలర్స్లో బౌల్ట్ 2 వికెట్లు, మిల్నే 2 వికెట్లు, బుమ్రా 2 వికెట్లు తీశారు. సీఎస్కే కెప్టెన్ ధోని మూడు పరుగులే చేసి పెవిలియన్ చేరాడు. మిగతా ఆటగాళ్లలో రైనా 4 పరుగులు, శార్దూల్ ఒక్క పరుగు చేశాడు.
Match 30. 19.6: J Bumrah to R Gaikwad, 6 runs, 156/6 https://t.co/HczPtOyfPM #CSKvMI #VIVOIPL #IPL2021
— IndianPremierLeague (@IPL) September 19, 2021
Innings Break!
— IndianPremierLeague (@IPL) September 19, 2021
88* off 58 from Ruturaj Gaikwad propels #CSK to a total of 156/6 on the board.#MI chase coming up shortly.
Scorecard – https://t.co/4eiKsS5213 #CSKvMI #VIVOIPL pic.twitter.com/CdxzDv4eSG