మాదాపూర్ : రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని ముంపు సమస్యలను పరిష్కరించడంలో భాగంగా నాలా విస్తరణ పనులను చేపట్టడం జరుగుతుందని స్థానిక ఎమ్మెల్యే, విప్ అరెకపూడి గాంధీ అన్నారు.
హఫీజ్పేట్ డివిజన్ పరిధిలోని ఈర్ల చెరువు నుండి దీప్తీ శ్రీ నగర్ కాలనీ (వయా జాతీయ రహదారి ఎన్హెచ్ 65) వరకు రూ. 15.88 కోట్ల అంచనా వ్యయంతో 2.4 కిలో మీటర్ల మేర చేపడుతున్న నాలా విస్తరణ పనుల్లో భాగంగా మదీనాగూడ రామకృష్ణ నగర్లో కొనసాగుతున్న పనులను స్థానిక ఎమ్మెల్యే, విప్ అరెకపూడి గాంధీ ఇరిగేషన్ శాఖ అధికారులతో కలిసి ఆదివారం పరిశీలించారు. అనంతరం కాలనీలో పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ … నాలా అభివృద్ధి పనులను వ్యూహత్మకంగా ఏర్పాటు చేస్తు ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గతంలో తలెత్తిన ముంపు సమస్యలను దృష్టిలో ఉంచుకొని ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ముందస్తు చర్యల్లో భాగంగా నాలా విస్తరణ పనులను చేపట్టడం జరుగుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఏఈ పావని, హఫీజ్పేట్ డివిజన్ టీఆర్ఎస్ గౌరవ అధ్యక్షుడు వాలా హరీష్రావు, చందానగర్ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రఘునాథ్రెడ్డిలతో పాటు స్థానికులు తదితరులు పాల్గొన్నారు.