వెంగళరావునగర్,జనవరి 6: పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సూచించారు. స్వచ్ఛ హైదరాబాద్-స్వచ్ఛ జూబ్లీహిల్స్ కార్యక్రమంలో భాగంగా గురవారం కృష్ణకాంత్ పార్కు వద్ద యూసుఫ్గూడ జీహెచ్ఎంసీ సర్కిల్కు మంజూరైన 19 స్వచ్ఛ ఆటోలను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాగంటి మాట్లాడుతూ..జూబ్లీహిల్స్ నియోజవర్గంలోని పరిసరాల్లో ఎక్కడా చెత్తా చెదారం కనిపించకూడదనే లక్ష్యంతోనే ఈ స్వచ్ఛ ఆటోలను ప్రారంభించామని తెలిపారు.
ఇంటితో పాటు..వీధులను పరిశుభ్రంగా ఉంచకోగలిగితే వ్యాధులు దరిచేరవని..మనతో పాటు సమాజంలో అందరూ ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు దేదీప్య విజయ్, రాజ్కుమార్ పటేల్, సీఎన్.రెడ్డి, జీహెచ్ఎంసి అధికారులు బిందుభార్గవి, విజయ్ కుమార్ టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
యూసుఫ్గూడ, రహ్మత్నగర్లో…
జూబ్లీహిల్స్,జనవరి6: స్వచ్ఛత ప్రమాణాలు పెంచేలా పారిశుధ్య నిర్వహణను చేపట్టాలని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సూచించారు. గురువారం యూసుఫ్గూడ, రహ్మత్నగర్లకు మంజూరైన స్వచ్ఛ ఆటోలను కార్పొరేటర్లు రాజ్కుమార్ పటేల్, సీఎన్ రెడ్డితో కలిసి జెండా ఊపి ప్రారంభించారు.