న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 15వ సీజన్ పోటీల వివరాలను బీసీసీఐ శుక్రవారం వెల్లడించింది. రెండు కొత్త జట్ల రాకతో గతానికి భిన్నంగా లీగ్ దశను రెండు గ్రూప్లుగా విభజించింది. ఇప్పటి వరకు లీగ్లో ఆయా జట్ల ప్రదర్శన ఆధారంగా గ్రూప్-‘ఎ’, గ్రూప్-‘బి’ని నిర్ణయించింది. ఒక్కో గ్రూప్లోని జట్టు ఆ గ్రూప్లో మిగిలిన నాలుగు జట్లతో రెండేసి మ్యాచ్లు వేరే గ్రూప్లోని ఒక జట్టుతో రెండు మ్యాచ్లు మిగిలిన నాలుగు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడనుంది. ఓవరాల్గా ఒక్కో టీమ్ 14 మ్యాచ్లు ఆడనుండగా.. లీగ్ దశలో మొత్తం 70 మ్యాచ్లు జరుగనున్నాయి. కరోనా కష్టకాలంలో ప్రయాణాలను నివారించాలనే ఉద్దేశంతో లీగ్ దశ మొత్తాన్ని ముంబై, పుణెలో నిర్వహించాలని బోర్డు నిర్ణయించింది. వాంఖడే, డీవై పాటిల్ మైదానాల్లో 20 మ్యాచ్లు, బ్రబౌర్న్, పుణె ఎంసీఏ స్టేడియంలలో 15 మ్యాచ్లు నిర్వహించనున్నట్లు బోర్డు ప్రకటించింది.
గ్రూప్-‘ఎ’ గ్రూప్-‘బి’
ముంబై చెన్నై
కోల్కతా హైదరాబాద్
రాజస్థాన్ బెంగళూరు
ఢిల్లీ పంజాబ్
లక్నో గుజరాత్