షిరాజ్ (ఇరాన్): భారత యువ షట్లర్ తస్నీమ్ మీర్ ఇరాన్ ఇంటర్నేషనల్ చాలెంజ్ ట్రోఫీ కైవసం చేసుకుంది. మహిళల జూనియర్ విభాగంలో ప్రపంచ నంబర్వన్గా నిలిచిన ఏకైక భారత ప్లేయర్గా రికార్డుల్లోకెక్కిన తస్నీమ్.. స్థాయికి తగ్గ ఆటతో విజృంభించింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో 16 ఏండ్ల తస్నీమ్ 21-11, 11-21, 21-7తో యూలియా సుసాంటోను చిత్తు చేసింది. సీనియర్ విభాగంలో ప్రస్తుతం ప్రపంచ 404వ ర్యాంక్లో ఉన్న తస్నీమ్ చాంపియన్గా నిలిచే క్రమంలో మార్టీనా రెపికా, పన్వర్, ఫాతిమాపై విజయాలు సాధించింది.