హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ): విద్యార్థుల అసలు విద్యార్హత ధ్రువీకరణ పత్రాలు (సర్టిఫికెట్స్) పూర్తిగా వారి వ్యక్తిగత ఆస్తేనని, ఫీజు బకాయిల పేరుతో వాటిని తమ వద్ద పెట్టుకొనే హకు ఏ విద్యాసంస్థకూ లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయలేదనే కారణంతోనైనా, విద్యార్థి నుంచి ఫీజు బకాయిలు రావాల్సి ఉన్నదనే కారణంతోనైనా ఒరిజినల్ సర్టిఫికెట్లను ఇవ్వకుండా ఆపడం చట్టవిరుద్ధమని తేల్చిచెప్పింది. బకాయిలు ఉంటే వాటిని చట్టబద్ధమైన మార్గాల్లోనే వసూలు చేసుకోవాలని, కానీ విద్యార్థి భవిష్యత్తును ప్రభావితం చేసే సర్టిఫికెట్లను బందీగా ఉంచడం చెల్లదని పేరొంది.
కొంపల్లిలోని మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాల వద్ద తన ఒరిజినల్ సర్టిఫికెట్లు నిలిచిపోయాయని ఆరోపిస్తూ హనుమకొండకు చెందిన చరణ్తేజ హైకోర్టును ఆశ్రయించారు. విచారించిన జస్టిస్ జువ్వాడి శ్రీదేవి కీలక ఉత్తర్వులు జారీచేశారు. అడ్మిషన్ సమయంలో షరతులు లేకుండా టెన్త్ మెమో, టీసీ, బోనఫైడ్ సర్టిఫికెట్లు, డిప్లొమా మారుల జాబితా పత్రాలను కళాశాలకు సమర్పించినట్టు పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు.
బీటెక్ అనంతరం సర్టిఫికెట్లను తిరిగి ఇవ్వాలని కోరగా, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ప్రభుత్వం చెల్లించలేదని, రూ.3.09 లక్షలు చెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామని కళాశాల తెలిపిందని వివరించారు. పరిశీలించిన న్యాయస్థానం, ఫీజుల విషయంలో వివాదం ఉంటే చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చని, ఒరిజినల్ పత్రాలను నిలిపివేయడం రాజ్యాంగబద్ధ హకులను ప్రభావితం చేసే చర్యగా పేరొంది. తీర్పు ప్రతిని అందుకున్న వారం రోజుల్లోపు పిటిషనర్కు చెందిన అన్ని అసలు సర్టిఫికెట్లు అప్పగించాలని కళాశాల యాజమాన్యాన్ని ఆదేశించింది.