హైదరాబాద్, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ): బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అపరిమిత అజ్ఞా నం కేంద్రం మెడకు చుట్టుకొన్నది. యాసంగి వడ్ల కొనుగోలుపై అడ్డగోలు ప్రకటనలు.. వరి వేయాల్సిందేనని రైతులకు మూర్ఖంగా ఇచ్చిన పిలుపు.. ధాన్యం కొనుగోలు కేంద్రాల దగ్గరకు వెళ్లి.. బీభత్సం సృష్టించడం వంటివన్నీ కలిసి.. గాలివానగా మారి ఢిల్లీ దాకా పోయింది. ‘కేంద్రం వరి కొంటలేదు.. వేయకండి’ అని రాష్ట్రం చెప్తుంటే.. అవే వీ బండి మెదడుకెక్కలేదు. నేను కొనిపిస్తానంటూ ప్రగల్భాలు పలికారు.
కల్లాల దగ్గరకు పోతే రైతుల నుంచి తీవ్రమైన నిరసనను ఎదుర్కొన్నారు. కొన్ని ఊళ్లల్లోకి అ డుగు కూడా పెట్టనివ్వని పరిస్థితి. చివరకు కేసీఆర్ ఏకం గా మహాధర్నాకు కూర్చోవడంతో సెగ ఢిల్లీకి తాకింది.
వ్యవసాయ చట్టాలను ప్రతిపాదించిన తొలిరోజు నుంచే దేశవ్యాప్తంగా రైతులు వ్యతిరేకిస్తున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సహా అనేక రాష్ర్టాల ప్రభుత్వాలు వారికి ప్రత్యక్షంగా మద్దతు పలికాయి. బీజేపీ రాష్ట్ర నేతలు మాత్రం ఉద్యమం చేసినోళ్లను హేళన చేశారు. వ్యవసాయ చట్టాలు అద్భుతం అని అన్నారు. మరిప్పుడు మోదీ ఎందుకు వెనక్కి తీసుకొన్నారు?
2020 అక్టోబర్ 3
దేశంలోని రైతులకు 2020 సెప్టెంబర్ 26న నిజమైన స్వాతంత్య్రం వచ్చింది. రైతు రక్షణ, సంక్షేమం, అభివృద్ధి కోసం ఉపయోగపడే చట్టాలు ఇవి. నూతన వ్యవసాయ చట్టాలు అన్నదాతలకు, వారి కుటుంబాలకు బంగారు బాటలు వేస్తాయి. ఈ చట్టాలను వ్యతిరేకిస్తున్న సీఎం కేసీఆర్ రైతుద్రోహిగా మిగిలిపోతారు.
2020 డిసెంబర్ 9
కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ కృత్రిమ ఉద్యమం చేస్తున్నది. రైతులు ఎక్కడా ధర్నాలో పాల్గొనటం లేదు.
2020 డిసెంబర్ 25
రైతులంతా నూతన వ్యవసాయ చట్టాలను స్వాగతిస్తున్నారు. రాజకీయ కారణాలతో టీఆర్ఎస్, కాంగ్రెస్ రైతుల్లో అయోమయాన్ని సృష్టిస్తున్నాయి. అద్భుతమైన చట్టాలు తెస్తే కొందరు మూర్ఖులు అడ్డుపడుతున్నారు.
2020 సెప్టెంబర్ 22
కొత్త వ్యవసాయ చట్టాలు రైతులకు కష్టాల నుంచి విముక్తి కల్పిస్తాయి. రానున్న రోజుల్లో రైతే రాజు అనేలా వ్యవసాయాన్ని తీర్చిదిద్దుతాయి.
2020 డిసెంబర్ 10
మోదీ ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ చట్టాలను బ్రోకర్లు వ్యతిరేకిస్తున్నారు. ఢిల్లీలో, తెలంగాణలో నిరసనలు తెలుపుతున్నారు. కొత్త వ్యవసాయ చట్టాలతో రైతులకు పెద్దమొత్తంలో లాభాలు వస్తాయి.
2020 డిసెంబర్ 20
కొత్త వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకొనే ప్రసక్తే లేదు. తిరుమలలో సుదర్శనం టికెట్ల మాదిరిగా కొత్త చట్టాల ద్వారా రైతులకు మార్కెట్ యార్డులో పడిగాపులు కాసే అవసరం తప్పుతుంది.
వరి వేయాలంటూ బండి సంజయ్ ఇచ్చిన పిలుపు, జిల్లాల యాత్రపై పలువురు కేంద్ర మంత్రులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బియ్యాన్ని కొనుగోలు చేయలేమని ఎఫ్సీఐతో చెప్పించి, తెలంగాణ ప్రభుత్వం మెడ మీద కత్తిపెట్టి మరీ ఒప్పందం చేయించుకొంటే.. మొత్తం సీన్ రివర్స్ చేశారంటూ ఆసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది. తెలిసీ తెలియక మాట్లాడారని ఎంత సర్ది చెప్పుకొన్నా రైతులు చల్లబడే పరిస్థితి కనిపించలేదు. మొత్తానికి బండి వ్యవహారం కేంద్రానికి గుదిబండగా మారింది. అందుకే శుక్రవారం సాగు చట్టాల రద్దుపై మోదీ ప్రకటన తరువాత బండి సహా బీజేపీ నాయకులెవరూ ఒక్క మాట కూడా మాట్లాడటానికి సాహసించలేదు.