సిటీబ్యూరో, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ): నాచారంలోని ఓ అమెరికా సంస్థ కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా రూ.18లక్షల విలువజేసే అత్యాధునిక 65 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. సీసీ కెమెరాల ఏర్పాటుకు సంబంధించి సంస్థ ప్రతినిధులు బుధవారం రాచకొండ సీపీ మహేశ్ భగవత్తో కలిసి ఒప్పందం చేసుకున్నారు. ఈ కెమెరాలను కొత్త సంవత్సరంలో ఏర్పాటు చేయనున్నారు. వీటిని నాచారం పీఎస్ పరిధిలో దాదాపు 25 బ్లాక్ స్పాట్స్తోపాటు మరో 40 హాట్ స్పాట్స్లో ఏర్పాటు చేయనున్నారు. ప్రజా భద్రత కోసం ముందుకొచ్చిన టెక్నిప్ ఎఫ్ఎంసీ సంస్థ ప్రతినిధులు హౌసిలా తివారీ, నరేంద్రకుమార్, నరేంద్ర దేశాయ్, సుజాత, క్రిస్టఫర్ను సీపీ మహేశ్ భగవత్ సత్కరించారు. ఈ సమావేశంలో మల్కాజిగిరి డీసీపీ రక్షిత మూర్తి, స్పెషల్ బ్రాంచి ఏసీపీ జావేద్, నాచారం ఇన్స్పెక్టర్ కిరణ్కుమార్ పాల్గొన్నారు.