కోహీర్, ఫిబ్రవరి10 : ప్రజల అవసరార్ధం ఆయా గ్రామాల్లో చేపట్టిన సీసీ రోడ్ల నిర్మాణాన్ని వెంటనే పూర్తి అందుబాటులోకి తీసుకురావాలని ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు పంచాయతీ రాజ్ శాఖాధికారులు, సర్పంచులను ఆదేశించారు.
గురువారం కోహీర్, ఖానాపూర్, పర్సపల్లి, సజ్జాపూర్, రాజనెల్లి, గురుజువాడ గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..మండలంలోని ఆయా గ్రామాల్లో సీసీ రోడ్లను నిర్మించేందుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నదని గుర్తు చేశారు.
వెంకటాపూర్, చింతల్ఘట్, బిలాల్పూర్, పర్సపల్లి, సజ్జాపూర్, ఖానాపూర్, రాజనెల్లి, గురుజువాడ గ్రామాలకు రూ.10లక్షల చొప్పున సీసీ రోడ్ల నిర్మాణానికి నిధులు కేటాయించిందని వెల్లడించారు. కోహీర్ పట్టణానికి మాత్రం రూ.20 లక్షలను మంజూరు చేసిందన్నారు.
రోడ్లను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. అనంతరం ఖానాపూర్ గ్రామంలోని దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆత్మకమిటీ చైర్మన్ విజయ్కుమార్, ఎంపీడీవో సుజాతనాయక్, సర్పంచులు బంటు తుల్జమ్మ, నర్సింహులు, రాములమ్మ, లచ్చమ్మ, సంగారెడ్డి, మండల అధ్యక్షుడు నర్సింహులు, మాజీ వైస్ ఎంపీపీ జావిద్, రామకృష్ణ, ఆనంద్, సవూద్, సాయిలు తదితరులు పాల్గొన్నారు.