న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో ( CBI ) కొత్తగా ముగ్గురు జాయింట్ డైరెక్టర్లను నియమించింది. వారిలో సీనియర్ ఐపీఎస్ అధికారులు విద్యా జయంత్ కులకర్ణి, ఘన్శ్యామ్ ఉపాధ్యాయ్, నవల్ బజాజ్ ఉన్నారు. వీరి నియామకానికి సంబంధించి పర్సనల్ మినిస్ట్రీ ఒక ప్రకటన కూడా చేసింది. విద్యాజయంత్ కులకర్ణి 1998 బ్యాచ్కు చెందిన తమిళనాడు క్యాడర్ ఐపీఎస్ అధికారి. డిప్యూటేషన్ బేసిస్పై ఐదేండ్ల కాలం ఆయన సీబీఐ జేడీగా పనిచేయనున్నారు.
ఇక, ఘన్శ్యామ్ ఉపాధ్యాయ్ 1999 బ్యాచ్కు చెందిన ఒడిశా క్యాడర్ ఐపీఎస్ అధికారి. 2026, జూన్ 9న ఆయన పదవీకాలం ముగిసే వరకు ఘన్శ్యామ్ సీబీఐ జేడీగా కొనసాగనున్నారు. నవల్ బజాజ్ 1995 బ్యాచ్కు చెందిన మహారాష్ట్ర క్యాడర్ ఐపీఎస్ అధికారి. ఆయన కూడా 2026, జూన్ 6న పదవీ విరమణ చేసేవరకు సీబీఐ జేడీగా కొనసాగుతారని పర్సనల్ మినిస్ట్రీ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నది.