రాంచీ: దాణా కుంభకోణం ఐదో కేసులోనూ ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ను సీబీఐ కోర్టు దోషిగా తేల్చింది. మొత్తం ఐదు కేసుల్లో ఇప్పటికే నాలుగింటిలో దోషిగా తేల్చగా.. తాజాగా ఐదో కేసులోనూ దోషిగా నిర్ధారించింది. దొరండా ట్రెజరీ నుంచి రూ.139.5 కోట్ల నిధుల దుర్వినియోగానికి సంబంధించి సీబీఐ ఐదో కేసును నమోదు చేసింది. లాలూ ప్రసాద్ బీహార్ సీఎంగా ఉన్నప్పుడు దాణా నిధుల దుర్వినియోగం జరిగిందంటూ 1996లో సీబీఐ కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఐదో కేసులో దోషిగా తేల్చినప్పటికీ శిక్షను మాత్రం ఈ నెల 21న కోర్టు ప్రకటించే అవకాశముంది.