హైదరాబాద్ : నాంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో ఓ కారు దగ్ధమైంది. ఏపీ ఫుర్నీచర్ ఎదురుగా హోండా సిటీ కారులో అకస్మాత్తుగా భారీ మంటలు చెలరేగడంతో ఆ మార్గంలో వెళుతున్న వాహనదారులు భయాందోళన చెందారు. కాగా, సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా దగ్ధమవగా అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు క్షేమంగా బయపడ్డారు.