అమరావతి, జూన్ 1: ఆనందయ్య కరోనా మందు కావాలనుకుంటున్న బయట వ్యక్తుల కోసం కాల్ సెంటర్, ప్రత్యేకంగా ఓ యాప్ ఏర్పాటు చేస్తున్నామని కలెక్టర్ చక్రధర్ బాబు చెప్పారు. యాప్ ద్వారా కరోనా మందు బుక్ చేసుకునే అవకాశాన్ని కూడా కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఆనందయ్య కరోనా మందు తయారీ పై నెల్లూరు కలెక్టర్ సమీక్ష సమావేశంలో చర్చించారు. రాష్ట్రంలో అమలవుతున్న కర్ఫ్యూనే కృష్ణపట్నంలోనూ అమలు చేస్తామని కలెక్టర్ చక్రధర్ బాబు స్పష్టం చేశారు. ఇతర ప్రాంతాల నుంచి కృష్ణపట్నంకు వస్తే.. ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన వెల్లడించారు.