న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17: ఎడ్యుటెక్ సేవల సంస్థ బైజుస్ భారీ పెట్టుబడులు పెట్టబోతున్నట్లు ప్రకటించింది. దేశవ్యాప్తంగా వచ్చే ఏడాదిన్నరలోగా 200 నగరాల్లో 500 ట్యూషన్ సెంటర్లను ఏర్పాటు చేయడానికి 200 మిలియన్ డాలర్లు(రూ.1,500 కోట్లకు పైగా) పెట్టుబడులు పెడుతున్నట్లు కంపెనీ సీవోవో మరినాల్ మోహిత్ తెలిపారు. పైలెట్ ప్రాజెక్టు కింద ప్రారంభించిన 80 సెంటర్లకు విద్యార్థుల నుంచి విశేష స్పందన లభించిందని, ముఖ్యంగా నాలుగు నుంచి 10వ తరగతి విద్యార్థులుకు ఆఫ్లైన్, ఆన్లైన్లో కాస్లు ఆఫర్ చేస్తున్నామన్నారు. అలాగే వచ్చే రెండేండ్లలో 10 లక్షల మంది విద్యార్థులకు సేవలు అందించడంతోపాటు 10 వేల మందికి ఉపాధి కల్పించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.