న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 14 రాష్ర్టాల్లో 30 అసెంబ్లీ స్థానాలు, మూడు ఎంపీ స్థానాలకు ఈ నెల 30న ఎన్నికలు జరుగనున్నాయి. ఈ స్థానాల్లో ఎన్నికల ప్రచారం బుధవారం సాయంత్రంతో ముగిసింది. ఓట్ల లెక్కింపు నవంబర్ 2న ఉంటుంది. దాద్రానగర్ హవేలీ, హిమాచల్ప్రదేశ్, మధ్యప్రదేశ్లో ఎంపీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ మూడు స్థానాల్లో ఎంపీగా గెలిచిన అభ్యర్థులు చనిపోవడంతో ఉప ఎన్నికలు అనివార్యంగా మారాయి.