ఇల్లంతకుంట, మే 13 : వరికొయ్యలు దహనం చేయడానికి వెళ్లిన ఓ మహిళా రైతు పొగ కారణంగా ఊపిరాడక అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం రహీంఖాన్పేటలో శుక్రవారం చోటుచేసుకొన్నది. గ్రామానికి చెందిన గుండ ఎంకవ్వ (55) తన వ్యవసాయ పొలం వద్ద వరి కొయ్యకాలు తగులబెట్టింది. గాలి ఎక్కువగా వీచడంతో పక్క వారి పొలంలోకి మంటలు వ్యాపించాయి. వాటిని అదుపు చేయడానికి చెట్టు కొమ్మలతో మంటలను ఆర్పింది. పొగ కారణంగా అస్వస్థతకు గురైన ఎంకవ్వ అక్కడే మరణించింది.