సిద్దిపేట : వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావుపై ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అనుచిత వ్యాఖ్యలపై బీఆర్ఎస్ బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. హనుమంతరావు వ్యాఖ్యలను ఖండిస్తూ జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. పలుచోట్ల మైనంపల్లి దిష్టిబొమ్మను దహనం చేశారు. తన కుటుంబ సభ్యునికి టికెట్ నిరాకరించారని ఎమ్మెల్యే మైనంపల్లి.. మంత్రి హరీశ్ రావుపై అవమానకరమైన వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి హరీశ్రావు ఉన్నారు.
అలాంటి వ్యక్తి పట్ల తప్పుగా ప్రవర్తిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలో పార్టీ కార్యకర్తలు మైనంపల్లి హనుమంతరావు దిష్టిబొమ్మలు దహనం చేశారు. చిన్నకోడూర్ మండలం చౌడారం గ్రామంలో మండల పార్టీ అధ్యక్షుడు కాముని శ్రీనివాస్, వైస్ ఎంపీపీ పాపయ్య, సర్పంచ్ అనిత బాలయ్య ఆధ్వర్యంలో దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించి దిష్టి బొమ్మని దహనం చేశారు.
ఈ కార్యక్రమంలో మండల యూత్ అధ్యక్షుడు వేణు, బీఆర్ఎస్వీ అధ్యక్షుడు పాల్గొన్నారు. హుస్నాబాద్లో మైనంపల్లి చేసిన వ్యాఖ్యలకు వెంటనే మంత్రి హరీశ్రావుకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ మైనంపల్లి దిష్టిబొమ్మ దహనం చేశారు.