శ్రీనగర్ : జమ్మూ కాశ్మీర్లోని అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో సరిహద్దు భద్రతా దళం (BSF) సోమవారం పాక్ చొరబాటుదారుడిని కాల్చి చంపింది. మరో మూడు రోజుల్లో అమర్నాథ్ యాత్ర ప్రారంభంకానున్న నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకున్నది. సరిహద్దు పరిశీలన పోస్ట్ (BOP) బక్వార్పూర్ ప్రాంతంలో రాత్రి 12.10 గంటల సమయంలో అనుమానాస్పద కదలికలను గుర్తించినట్లు బీఎస్ఎఫ్ తెలిపింది. చొరబాటుదారుడిని హెచ్చరించినా పట్టించుకోలేదని, ఈ క్రమంలోనే మూడురౌండ్లు కాల్పులు జరిపినట్లు పేర్కొంది.
ఆ తర్వాత చొరబాటుదారుడు ఫెన్సింగ్పై నుంచి కిందపడిపోయాడని పేర్కొంది. తెల్లవారు జామున బీఎస్ఎఫ్ సెర్చ్ ఆ పార్టీ ఆ ప్రాంతంలో తనిఖీ చేయగా.. కంచెకు సమీపంలో పాక్ చొరబాటుదాడి మృతదేహాన్ని గుర్తించినట్లు చెప్పింది. మృతదేహాన్ని పోలీసులకు అప్పగించనున్నటుల్ పేర్కొంది. మరోవైపు దోడా పోలీసులు భద్రతా బలగాలతో కలిసి ఓ ఉగ్రవాదిని సోమవారం అరెస్టు చేశారు. అరెస్టయిన ఉగ్రవాదిని కోటి దోడా నివాసి ఫరీద్ అహ్మద్గా గుర్తించారు. అతని వద్ద నుంచి ఒక చైనీస్ పిస్టల్, రెండు మ్యాగజైన్లు, 14 లైవ్ కాట్రిడ్జ్లు, మొబైల్ ఫోన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.