నల్లగొండ రూరల్, నవంబర్ 7: ‘ఉమ్మడి రాష్ట్రంలో ఐటీ మంత్రిగా ఉండి కూడా జిల్లాకు ఐటీ హబ్ను తేలేక పోయావ్ గానీ, కమీషన్లను మాత్రం ఇంట్లోకి వరదలా తెచ్చుకున్నావు’ అని కోమటిరెడ్డి వెంకట్రెడ్డిని ఉద్దేశించి ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి విమర్శించారు. మండలంలోని చిన్న సూరారం, పెద్ద సూరారం, చందనపల్లి, ఖాజీ రామారం, రెడ్డి కాలనీ, దండంపల్లి, జీ.చెన్నారం, తొరగల్, మేళ్లదుప్పలపల్లి గ్రామాల్లో మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి మాట్లాడుతూ నల్లగొండ ప్రజలు తరిమికొడితే కోమటిరెడ్డి భువనగిరికి పారిపోయి అక్కడ కమీషన్ల దండుకున్నాడని, అలా వచ్చిన దొంగ డబ్బులతోనే ఇక్కడి నాయకులను కొనగలడే గానీ ప్రజలకు తన మీద ఉన్న అభిమానాన్ని కొనలేడని పేర్కొన్నారు. నల్లగొండలో అభివృద్ధి కొనసాగాలంటే బీఆర్ఎస్కు మరో అవకాశం ఇవ్వాలని కోరారు.
బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఊహించని అభివృద్ధి జరిగిందన్నారు. కార్యక్రమంలో సింగిల్విండో చైర్మన్ నాగరత్నం రాజు, సీనియర్ నాయకులు కటికం సత్తయ్య గౌడ్, బకరం వెంకన్న, రాంరెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు దేప వెంకట్రెడ్డి, మహిళా విభాగం అధ్యక్షురాలు కొప్పుల విమలమ్మ, మాజీ ఎంపీపీ నారబోయిన భిక్షం, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు మన్నె కృష్ణ్ణార్జున్రెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు రాజుపేట మల్లేశ్, సర్పంచులు నారబోయిన నర్సింహ, కోట్ల రమాదేవి, సురిగి మణెమ్మ, ఎలుక శ్రీనివాస్రెడ్డి, చింత పుష్ప, మదర్ డెయిరీ డైరెక్టర్ జలేందర్రెడ్డి, డాక్టర్ చెరుకు సుహాస్, తవిట కృష్ణ, జంగయ్య, రవీందర్రెడ్డి, శంకర్, వెంకట్రెడ్డి పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు గ్రామాలకు వెళ్లిన ఎమ్మెల్యే భూపాల్రెడ్డికి ప్రజలు పూలతో కోలాట ప్రదర్శనతో ఘన స్వాగతం పలికారు. మహిళలు భూపాల్రెడ్డికి తిలకం దిద్ది స్వాగతించారు.
బీఆర్ఎస్లో చేరిక
తిప్పర్తి : మండలంలోని గంగన్నపాలెం గ్రామానికి చెందిన మర్రి శ్రీనివాస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మర్రి మదన్ తో పాటు సు మారు 200 మంది కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి గులాబీ కండువా కప్పి బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాభివృద్ధికి దాదాపుగా రూ.80 లక్షలు నిధులు మం జూరు చేశానని, కానీ సర్పంచ్ మోసం చేసినప్పటికీ గంగన్నపాలెం ప్రజలు మాత్రం బీఆర్ఎస్ వైపే ఉన్నారని అన్నారు. కార్యక్రమంలోబీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పల్రెడ్డి రవీందర్రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ దొంతం ఇంద్రసేనారెడ్డి, నాయకులు జీడిపల్లి వెంకట్రెడ్డి, లొడంగి గోవర్ధన్, వి.నాగేశ్వర్రావు, కందుల లక్ష్మయ్య, సూర్యప్రకాశ్రెడ్డి, మర్రి శ్రీనివాస్ పాల్గొన్నారు.