హుస్నాబాద్, నవంబర్ 5 : హుస్నాబాద్ నియోజకవర్గంలో గులాబీ దండు కదిలింది. నియోజకవర్గంలోని ఏడు మండలాలతోపాటు గ్రామాల్లో ఇంటింటి ప్రచారం ప్రారంభించారు. ఒకవైపు ఎమ్మెల్యే వివిధ మండలాల్లో ప్రచారం కొనసాగిస్తున్నారు. ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు సభ్యు లు, మండల అధ్యక్షులు, గ్రామశాఖ అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. హుస్నాబాద్ పట్టణంలోని వార్డుల్లో మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్, కౌన్సిలర్లు, బీఆర్ఎస్ వార్డు ఇన్చార్జి ఆధ్వర్యంలో మొదటి దశ ఇంటింటి ప్రచారం పూర్తిచేశారు. మచ్చలేని నాయకుడు సతీశ్కుమద్దతుగా ప్రజలు ప్రచారంలో భాగస్వాములవుతున్నారు. ఆయా గ్రామాల్లో సతీశ్కుమార్కు హ్యాట్రిక్ విజయాన్ని అందిస్తామని తీర్మానాలుచేస్తున్నారు.
తొమ్మిదిన్నరేండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు, అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరిస్తూ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధితో పాటు ఆయా గ్రామాల్లో జరిగిన అభివృద్ధిపై ప్రజలకు వివరిస్తున్నారు. రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, కేసీఆర్ కిట్, అమ్మఒడి, న్యూట్రిషన్ కిట్ల గురించి తెలియజేస్తున్నారు. బీఆర్ఎస్ మ్యానిఫెస్టోను సైతం విస్తృత ప్రచారం చేస్తున్నారు. మూడోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే పింఛన్లు, రైతుబంధు పెంచడం, రూ.400లకే గ్యాస్ సిలిండర్ ఇవ్వడం, ఉచిత బీమా సౌకర్యం, సన్నబియ్యం పంపిణీని వివరిస్తున్నారు.
ఎమ్మెల్యే సతీశ్కుమార్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇప్పటికే అక్కన్నపేట మండలంలోని 31 గ్రామ పంచాయతీలు, అనుబంధ గ్రామాలు, గిరిజన తం డాల్లో మొదటి దశ ప్రచారం పూర్తి చేశారు. హుస్నాబాద్, కోహెడ, చిగురుమామిడి, సైదాపూర్, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి మండలాల్లో 50శాతం మొదటిదశ ప్రచారం పూర్తయింది. దాదాపు అన్ని మండలాల్లో మొదటి దశ ప్రచారం పూర్తి చేసి రెండోదశ ప్రచారాన్ని నిర్వహించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ప్రత్యర్థి అభ్యర్థి ప్రచారం మొదలు కాకముందే బీఆర్ఎస్ అభ్యర్థి సతీశ్ ప్రచారంలో ముందున్నారు. ప్రజల నుంచి కూడా అనూహ్య స్పందన లభిస్తున్నది. హుస్నాబాద్ నియోజకవర్గంలో గులాబీ జెండా మూడోసారి రెపరెపలాడించేందుకు కార్యకర్తలు, నాయకులు, అభిమానులు తమవంతు కృషిచేస్తున్నారు.
కోహెడ, నవంబర్ 5 : నేడు మండలంలో హుస్నాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి వొడితెల సతీశ్కుమార్ ఇంటింటి ప్రచారం నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు వరికోలు, రామచంద్రాపూర్ వింజపల్లి గ్రామాల్లో ప్రచారం చేయనున్నారు. మండల ప్రజాప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఆవుల మహేందర్ కోరారు.