KCR | సూర్యాపేట నుంచి భువనగిరికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రోడ్ షో కొనసాగుతోంది. ముందుగా తిమ్మాపురం, అర్వపల్లి, దేవరుప్పల, పాలకుర్తి, ఆలేరు మీద కేసీఆర్ రాయదుర్గం చేరుకున్నారు. ఈ సందర్భంగా సూర్యాపేట మండలం ఎర్కారం గ్రామ సమీపంలోని దుబ్బ తండా రైతు ధరావత్ నర్సింహాను కేసీఆర్ కలిశారు. ఈ సందర్భంగా తన పొలానికి నీళ్లందక పంట పూర్తిగా ఎండిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కండ్ల నీళ్లు పెట్టుకున్న రైతు ధరావత్ నర్సింహాకు కేసీఆర్ ధైర్యం చెప్పారు.
కాగా, తన ఐదెకరాల వరి పంట ఎండిపోవడంతో ఎంతో ఆవేదనతో పొలంలోనే దుఃఖించిన రైతు ధరావత్ నర్సింహా వీడియో ఇటీవల సోషల్మీడియాలో వైరల్గా మారింది. ఈ క్రమంలోనే తన రోడ్ షోలో భాగంగా దుబ్బా తండా వద్ద ఆగిన కేసీఆర్ ధరావత్ నర్సింహాను కలిసి ధైర్యం చెప్పారు.
కాంగ్రెస్ తెచ్చిన కరువుతో అల్లాడుతున్న రైతన్నలు
సూర్యాపేట రూరల్ మండలం ఎర్కారం గ్రామం దుబ్బ తండాకు చెందిన దరావత్ నర్సింహ అనే రైతు తనకున్న 3 ఎకరాలు కాకుండా 5 ఎకరాలు కౌలుకు తీసుకుని సాగు చేస్తుండగా నీళ్లు లేక పొలాలు ఎండిపోవడంతో, ఎండిపోయిన పొలంలో తన ఆవేదన వ్యక్తం చేశాడు. pic.twitter.com/Zie8wyiN3t
— BRS Party (@BRSparty) March 20, 2024