ముంబై : స్వతహాగా ఫుడ్ లవర్ అయిన భారత్లో బ్రిటన్ రాయబారి అలెక్స్ ఎలిస్ తరచూ దేశంలోని వివిధ ప్రాంతాల్లో స్ధానిక వంటకాలను రుచి చూస్తూ ఆయా పోస్ట్లను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. గతంలో వడపావ్, దోసె, రసగుల్లా వంటి భారత డిషెస్ను ఆస్వాదించిన ఫొటోలను ఎలిస్ ట్విట్టర్లో షేర్ చేశారు.
ముంబైలో తాజాగా ఓ స్ట్రీట్ ఫుడ్ స్టాల్లో స్పైసీ స్నాక్ను ఆరగిస్తున్న పోస్ట్ను హై కమిషనర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ పోస్ట్లో ఫుడ్ స్టాల్ వద్ద ఎలిస్ ఫేమస్ బాంబే శాండ్విచ్, ఐస్క్రీంను టేస్ట్ చేస్తూ కనిపించారు. ఈ డిషెస్ టేస్ట్ను ఆయన ఎంజాయ్ చేస్తూ కమ్ ఈట్ అంటూ రాసుకొచ్చారు. ముంబైవాసిలా ఈరోజు స్దానిక రుచులను ఆస్వాదించా..బాంబే శాండ్విచ్, చిల్లీ ఐస్క్రీంను టేస్ట్ చేశా అంటూ పోస్ట్కు క్యాప్షన్ ఇచ్చారు.
ఈ పోస్ట్ను ఇప్పటివరకూ 5,000 మందికి పైగా వీక్షించగా, పలువురు రియాక్టయ్యారు. ముంబైలో మరికొన్ని డిష్లను ట్రై చేయాలని ఎలిస్కు నెటిజన్లు సూచించారు. అలెక్స్ ఎలిస్ 2021లో భారత్లో బ్రిటన్ హైకమిషనర్గా నియమితులయ్యారు.