న్యూఢిల్లీ: గాల్లో నుంచి ప్రయోగించగల బ్రహ్మోస్ సూపర్సానిక్ క్రూజ్ క్షిపణిని భారత్ అభివృద్ధి పరుస్తున్నది. 800 కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రు స్థావరాలను ధ్వంసం చేసే సామర్థ్యం దీనికి ఉందని చెబుతున్నారు. ఇప్పటికే ఉన్న బ్రహ్మోస్ సూపర్సానిక్ క్షిపణి పరిధి 300 కిలోమీటర్లు. దీన్ని సు-30 ఎంకే యుద్ధ విమానం నుంచి ప్రయోగించేవారు. ఇటీవలే బ్రహ్మోస్ క్షిపణిని పరీక్షిస్తుండగా పొరపాటున పాకిస్థాన్ భూభాగంలో పడిన విషయం తెలిసిందే.