బాక్సింగ్ దిగ్గజం మైక్టైసన్ ‘లైగర్’ చిత్రం ద్వారా తొలిసారి భారతీయ వెండితెరపై అరంగేట్రం చేయబోతున్న విషయం తెలిసిందే. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతున్నది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళీ భాషల్లో రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో మైక్టైసన్ ప్రతి నాయకుడి పాత్రలో కనిపించనున్నారు. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని కొత్త పోస్టర్ను విడుదల చేశారు. ‘నమస్తే ఇండియా… యాక్షన్ హంగామా కోసం రెడీగా ఉండండి’ అంటూ మైక్టైసన్ ఇన్స్టాగ్రామ్లో వ్యాఖ్యానించారు. ‘మైక్టైసన్ పంచ్పవర్ ఏమిటో ఈ ప్రపంచం మొత్తానికి తెలుసు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ, మైక్టైసన్ మధ్య వచ్చే సన్నివేశాలు రొమాంచితంగా ఉంటాయి. థాయ్లాండ్ స్టంట్ దర్శకుడు కెచ్చా కంపోజ్ చేసిన యాక్షన్ ఘట్టాలు ప్రత్యేకాకర్షణగా నిలుస్తాయి. ప్రస్తుతం ముంబయిలో చిత్రీకరణ జరుగుతున్నది. వచ్చే ఏడాది ప్రథమార్థంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’ అని చిత్రబృందం తెలిపింది. అనన్యపాండే, రమ్యకృష్ణ, రోనిత్రాయ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: విష్ణుశర్మ, నిర్మాతలు: పూరి జగన్నాథ్. ఛార్మీకౌర్, కరణ్జోహార్, అపూర్వమోహతా, దర్శకుడు: పూరి జగన్నాథ్.