హైదరాబాద్ : ఈ నెల 11న సింగరేణి కార్మికులకు బోనస్ చెల్లించనున్నట్లు సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీధర్ తెలిపారు. ఈ నెల 8న అడ్వాన్స్ చెల్లించనున్నట్లు పేర్కొన్నారు. నవంబర్ 1న దీపావళి బోనస్ ఇవ్వనున్నట్లు చెప్పారు. సగటున ఒక్కో కార్మికుడికి రూ.1.15లక్షల వరకు చెల్లించనున్నట్లు పేర్కొన్నారు. లాభాల వాటా బోనస్ రూ.79.07కోట్లు, దీపావళి బోనస్గా చెల్లింపునకు రూ.300కోట్లు సంస్థ చెల్లిస్తుందని సీఎండీ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. నిన్న సింగరేణి సంస్థలపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సంస్థ ఆర్జించన లాభాల్లో కార్మికులకు 29శాతం వాటా ఇవ్వాలని నిర్ణయించారు. గతేడాది కంటే ఈసారి ఒక శాతం వాటాను అధికంగా పెంచారు. దసరా కంటే ముందే కార్మికులకు వాటాను చెల్లించాలని సీఎండీని ఆదేశించారు.