తిమ్మాపూర్ : మండలంలోని కొత్తపల్లి శివారులో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడు. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్కు చెందిన బూర శ్రీధర్ (45) తన కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ నుంచి కరీంనగర్కు కారులో వస్తున్నాడు.
కొత్తపల్లి గ్రామ శివారుకు చేరుకోగానే ముందు వెళ్తున్న బొలెరో వాహనం ఇండికేటర్లు వేయకుండా యూటర్న్ తీసుకుంటుండగా వెనుకలే వస్తున్న వారి కారు బొలెరో వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో వెనుక కూర్చున్న బూర శ్రీధర్కు బలమైన గాయాలు కావడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. కారు డ్రైవర్తోపాటు బంధువులకు గాయాలు కావడంతో ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎల్ఎండి ఎస్ఐ ప్రమోద్రెడ్డి తెలిపారు.