హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఎమ్మెల్సీ కవిత పుట్టిన రోజు(ఈనెల 13) సందర్భంగా ఓయూ విద్యార్థులు, టీఆర్ఎస్వీ నిర్వహిస్తున్న కల్వకుంట్ల కవిత టీ20 క్రికెట్ టోర్నీలో బ్లూస్ హైదరాబాద్ జట్టు శుభారంభం చేసింది. గురువారం ఎల్బీ స్టేడియం వేదికగా జరిగిన తొలి మ్యాచ్లో హైదరాబాద్ జట్టు 14 పరుగుల తేడాతో మేడ్చల్ టీఆర్ఎస్వీ టీమ్పై విజయం సాధించింది. తొలుత నిర్ణీత 20 ఓవర్లలో హైదరాబాద్ 9 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. రమేశ్(44) రాణించాడు. ఆ తర్వాత లక్ష్యఛేదనకు దిగిన మేడ్చల్ 113 పరుగులకే కుప్పకూలింది. నాగరాజు(4/26) నాలుగు వికెట్లతో విజృంభించాడు. పది జిల్లాలకు చెందిన జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీని రాష్ట్ర క్రీడా మంత్రి శ్రీనివాస్గౌడ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గ్యాదరి కిషోర్, టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, సాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్రెడ్డి, ఓయూ టీఆర్ఎస్వీ నాయకులు శ్యామ్, శ్రీకాంత్గౌడ్, చందు, నాగేందర్ తదితరులు పాల్గొన్నారు.