న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9: దేశంలో నిరుద్యోగం పెరగడంపై విపక్షాలు కేంద్రప్రభుత్వాన్ని నిలదీశాయి. ఉద్యోగ కల్పనపై బడ్జెట్లో ప్రతిపాదనలు ఏమీ లేవని విమర్శించాయి. బడ్జెట్పై రాజ్యసభలో సాధారణ చర్చ సందర్భంగా టీఎంసీ ఎంపీ సేన్, సీపీఎం ఎంపీ ఎలమారం కరీం మోదీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. 2014లో మోదీ 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారని, తాజా బడ్జెట్లో ఆర్థిక మంత్రి 60 లక్షల ఉద్యోగాలు అంటున్నారని, ఎవరు అబద్ధం చెప్తున్నారని ప్రశ్నించారు.
బీజేపీ చేపట్టిన ప్రైవేటైజేషన్ డ్రైవ్ విధ్వంసకరమైందని అన్నారు. పెట్టుబడి ఉపసంహరణ విధానాన్ని ‘సేల్ ఇండియా’ కార్యక్రమంగా అభివర్ణించారు. ఆలిండియా సర్వీసుల అధికారుల క్యాడర్ రూల్స్కు సవరణ ప్రతిపాదనలపై రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలు వెలిబుచ్చిన అభిప్రాయాలు, అభ్యంతరాలను కేంద్రం ప్రభుత్వం పరిశీలిస్తున్నదని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ లోక్సభలో తెలిపారు.