BJP Ramchanderrao | పోక్సో కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్ పరారీలోనే ఉన్నట్టు శుక్రవారం నిర్వహించిన ‘కాంక్లేవ్-2026’ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్వయంగా వెల్లడించారని తెలిసిందే.
కాగా ఇదే ఈవెంట్లో ఒక అమ్మాయి పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసినప్పుడు ఆమెకు ప్రభుత్వం న్యాయం చేయమని ఓ పార్టీగా మీరు వెళ్లి ఆ అమ్మాయికి సానుభూతి తెలుపడమో, కలవడమో చేయాలి కదా..? బాధితురాలిని రాజకీయ పార్టీలు కలవకూడదా..? మద్దతు ఇవ్వకూడదా..? అన్న ప్రశ్నకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు స్పందిస్తూ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మేము అధికారంలో లేము కదా, POCSO కేసులో ఉన్న మైనర్ బాలిక ఇంటికి వెళ్లి మేమెలా పరామర్శిస్తాం. ఆ పని అధికార పార్టీ, పోలీసులు చేయాలని రాంచందర్ రావు చేసిన కామెంట్స్ సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి.
మేము అధికారంలో లేము కదా, POCSO కేసులో ఉన్న మైనర్ బాలిక ఇంటికి వెళ్లి మేమెలా పరామర్శిస్తాం
ఆ పని అధికార పార్టీ, పోలీసులు చేయాలి
– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు pic.twitter.com/MNt8ioV5yI
— Telugu Scribe (@TeluguScribe) May 15, 2026