కందుకూరు, జనవరి 6: ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు బీజేపీ నాయకులు ఆడుతున్న డ్రామాలను కట్టిపెట్టాలని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. గురువారం కందుకూరు మండలం దన్నారం గ్రామానికి చెందిన మిడుదల శ్రీదేవి శేఖర్రెడ్డితో పాటు పలువురు టీఆర్ఎస్ నాయకులు మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రగతిని చూసి ఓర్వలేక బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో పాటు రాష్ట్ర నాయకులు అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నారన్నారు. బీజేపీ నాయకుల తీరును తెలంగాణ ప్రజలు అసహ్యించుకుంటున్నారని.. వారు ఇకనైనా మారకపోతే ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. అభివృద్ధికి సహకరించకుండా విమర్శించడం తగదన్నారు. కార్యక్రమంలో జమ్మత్రెడ్డి, మల్లేశ్, వార్డుసభ్యులు పాల్గొన్నారు.