కమలాపూర్ రూరల్ : బీజేపీ దళిత వ్యతిరేకి అని, దళితబంధు పథకాన్ని ఆపిన ఆ పార్టీ నాయకులకు ఓటుతోనే బుద్ధి చెప్పాలని ఎస్సీ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ బండ శ్రీనివాస్ పిలుపునిచ్చారు. కమలాపూర్ మండలకేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ వద్ద కేయూ దళిత సంఘాలతో ఆయన మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని రద్దు చేసేలా బీజేపీ, ఆర్ఎస్ఎస్ నాయకులు కుట్రలు చేస్తున్నారని విమర్శించారు.
దళితబిడ్డల ఉన్నత చదువు, పరిశోధనల కోసం కేంద్ర ప్రభుత్వం నిధులివ్వడం లేదన్నారు. దళితుల సమగ్రాభివృద్ధిని పట్టించుకోని బీజేపీకి బుద్ధి చెప్పాలన్నారు. దళితుల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళితబంధు పథకాన్ని కుట్రలు చేసి ఆపారన్నారు.
గెల్లు శ్రీనివాసుకు దళితులు మద్దతు తెలిపి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో కేయూ జేఏసీ చైర్మన్ డాక్టర్ బొల్లికొండ వీరేందర్, నాయకులు దేశబోయిన రాకేశ్, ఈసంపెల్లి శ్రీధర్, పుల్ల శ్రీనివాస్, ఈసంపెల్లి శ్రీధర్, వడ్ల రవీందర్, మాట్ల మల్లేశం, శనిగరపు చిరంజీవి, శ్రీకాంత్, నాగరాజు, రత్నం పాల్గొన్నారు.