Bill Gates : ఏఐతో ఉద్యోగాలు కనుమరుగవుతాయనే విషయంపై నెలల తరబడి హాట్ డిబేట్ సాగుతుండగా దీనిపై టెక్ నిపుణుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏఐతో ఉత్పాదకత పెరుగుతుందని కొందరు చెబుతుండగా, మరికొందరు టెక్ దిగ్గజాలు ఏఐతో కొలువుల కోత తప్పదని తేల్చిచెబుతున్నారు. ఈ విషయం ఎలా ఉన్నా మనుషులు పనిచేసే తీరుపై మాత్రం ఏఐ తనదైన ముద్ర వేస్తుందనేది సుస్పష్టం. ఇక ఏఐ మనుషుల పనులను సులభతరం చేస్తుందని పని గంటలను కూడా తగ్గిస్తుందని మైక్రోసాఫ్ట్ వ్యవస్ధాపకులు బిల్ గేట్స్ పేర్కొన్నారు.
లేటెస్ట్ టెక్నాలజీతో వారానికి మూడు పనిదినాల విధానం అందుబాటులోకి రావడం స్వాగతించదగిన పరిణామమని చెప్పుకొచ్చారు. మైక్రోసాఫ్ట్ ఏఐ ప్రాజెక్టులకు సారధ్యం వహిస్తున్న బిల్గేట్స్ ఏఐతో సమూల మార్పులు రానున్నాయని అన్నారు. పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో ఏఐతో చోటుచేసుకునే మార్పులపై గేట్స్ తన అభిప్రాయాలను పంచుకున్నారు.
కార్పొరేట్ ప్రపంచంలో ఏఐ కీలక మార్పులకు దారితీస్తుందని అన్నారు. వారానికి మూడు పనిదినాల విధానం అందుబాటులోకి రానుందని చెప్పారు. దశాబ్ధాలుగా అనుసరిస్తున్న వారానికి ఐదు పనిదినాల పద్ధతికి ఏఐతో స్వస్తిపలుకుతారని అంచనా వేశారు. వారానికి మూడు రోజులు మాత్రమే పనిచేసే సమాజంలోకి మనం మారితే అది ఆమోదయోగ్యమేనని బిల్ గేట్స్ పేర్కొన్నారు.
Read More :
Lok Sabha Elections | మూడో విడుత నామినేషన్లు షురూ.. 94 ఎంపీ స్థానాల్లో మే 7న పోలింగ్