పాట్నా: బీహార్లో ఓ నిరుద్యోగిపై లాఠీ విరిగింది. జాతీయ జెండా పట్టుకుని నిరసన తెలుపుతున్న అతన్ని పోలీసులు చితకబాదారు. పాట్నాలో ఇవాళ వేలాది మంది నిరుద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. అయితే ఓ నిరుద్యోగి తన చేతుల్లో జాతీయ జెండా పట్టుకుని నిరసన చేపడుతున్న సమయంలో.. ఓ పోలీసు అతన్ని తన వద్ద ఉన్న లాఠీతో చితకబాదాడు. రక్తం చిందేలా అతన్ని కొట్టాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ ఘటన పట్ల పాట్నా జిల్లా మెజిస్ట్రేట్ విచారణకు ఆదేశించారు.
माननीय उपमुख्यमंत्री जी ने पटना जिलाधिकारी से फोन पर वार्ता की। DM ने पटना Central SP और DDC के नेतृत्व में एक जाँच कमेटी का गठन किया है कि ADM ने अभ्यर्थियों पर स्वयं लाठीचार्ज क्यों किया, ऐसी क्या नौबत थी?दोषी पाए जाने पर संबंधित अधिकारी पर कारवाई होगी।
pic.twitter.com/XKLKhxBFQ4— Office of Tejashwi Yadav (@TejashwiOffice) August 22, 2022
డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ ఈ ఘటన పట్ల స్పందించారు. సరైన చర్యలు తీసుకుంటామన్నారు. విద్యార్థులు సహనంతో ఉండాలన్నారు. సమస్యల్ని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఉద్యోగ కల్పన కోసం కసరత్తులు చేస్తున్నట్లు తేజస్వి చెప్పారు. 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఆగస్టు 15వ తేదీన ప్రకటన చేసినట్లు ఆయన గుర్తు చేశారు.