హైదరాబాద్, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్ శుక్రవారం ప్రమా ణం చేశారు. బాంబే హైకోర్టు నుంచి బదిలీపై వచ్చిన ఆయనతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్చంద్రశర్మ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి హైకోర్టు న్యాయమూర్తులు, జస్టిస్ భూయాన్ కు టుంబసభ్యులు, అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్, బార్ కౌన్సిల్ చైర్మన్ ఏ నర్సింహారెడ్డి, అదనపు సొలిసిటర్ జనరల్ టీ సూర్యకరణ్రెడ్డి, సహాయ సొలిసిటర్ జనరల్ ఎన్ రాజశ్వేరరావు, పీపీ ప్రతాప్రెడ్డి తదితరులు హాజరయ్యారు. అనంతరం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శర్మ నేతృత్వంలోని ధర్మాసనంలో జస్టిస్ భూయాన్ కేసుల విచారణ చేపట్టారు. సీనియార్టీ ప్రకారం రెండో స్థానం లో జస్టిస్ భూయాన్ ఉన్నారు. ప్రస్తుతం సీజేతో కలిపి హైకోర్టులో 18 మంది న్యాయమూర్తులున్నారు. భోజన విరామ సమయంలో హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పొన్నం అశోక్గౌడ్ అధ్యక్షతన జస్టిస్ ఉజ్జల్ భూ యాన్ను సన్మానించారు. కార్యక్రమంలో ఏజీ, అసోసియేషన్ కార్యదర్శులు సీహెచ్ కల్యాణ్రావు, టీ సృజన్కుమార్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.