హైదరాబాద్/ సిటీబ్యూరో, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర విద్యు త్తు నియంత్రణ మండలి (టీఎస్ఈఆర్సీ) కార్యాలయ భవన నిర్మాణం కోసం అవసరమైన బోరు వేసేందుకు చైర్మన్ తన్నీరు శ్రీరంగారావు ఆదివా రం పూజలు నిర్వహించారు. లక్డీకాపూల్లోని అమరావతి థియేటర్ సమీపంలో నూతన భవనం నిర్మించేందుకు వీలు గా రాష్ట్ర ప్రభుత్వం 1,500 గజాల స్థలాన్ని కేటాయించింది. ప్రస్తుతం సింగరేణిభవన్లో కిరాయికి టీఎస్ఈఆర్సీ కార్యాలయం నిర్వహిస్తున్నా రు. ప్రభుత్వం కేటాయించిన భూమిలో శాశ్వత భవనాన్ని నిర్మించనున్నారు.