భద్రాద్రి: భద్రాచల రామయ్య ఆలయ నిర్మాత, వాగ్గేయకారుడు భక్త రామదాసు (Bhakta Ramadasu ) 389వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శుక్రవారం ఉదయం రామాలయంలోని భక్త రామదాసు విగ్రహానికి స్నపన తిరుమంజనం నిర్వహించారు. వాగ్గేయకారుడి విగ్రహంతో ఆలయ ప్రదక్షిణ, గిరిప్రదక్షణ చేశారు. చిత్రకూట మండపంలో వైభవంగా వాగ్గేయకారోత్సవాలు జరుగుతున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విద్వాంసులు భక్త రామదాసు కీర్తనలను ఆలపిస్తున్నారు.
రామదాసు కీర్తనల ఘనతను చాటి చెప్పడానికి గత 16 ఏండ్లుగా భక్త రామదాసు జయంతి ఉత్సవాలను ప్రతి ఏటా మూడు రోజులపాటు నిర్వహిస్తున్నారు. రామదాసు జన్మస్థలమైన ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలోనూ ప్రభుత్వం భక్తరామదాసు జయంతి ఉత్సవాలను ప్రభుత్వం నిర్వహిస్తున్నది. భాషా సాంస్కృతిక శాఖ, ఖమ్మం జిల్లా యంత్రాంగం, భద్రాచలం దేవస్థానం, నేలకొండపల్లిలో ఏర్పాటైన శ్రీభక్తరామదాస విద్వత్ కళాపీఠం సంయుక్త ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు.