హైదరాబాద్, డిసెంబర్ 7: కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్, స్మార్ట్ఫోన్ తయారీలో అగ్రగామి సంస్థల్లో ఒకటైన భగవతి ప్రొడక్ట్ లిమిటెడ్కు పీఎల్ఐ స్కీం కింద కేంద్ర ప్రభుత్వం గుర్తింపు లభించింది. కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆధ్వర్యంలోని 3 పీఎల్ఐ స్కీం కింద కంపెనీకి చెందిన ఉత్పత్తులకు గుర్తింపు లభించినట్లు పేర్కొంది. ఈ సందర్భంగా కంపెనీ డైరెక్టర్ రాజేశ్ అగర్వాల్ మాట్లాడుతూ..‘మేక్ ఇన్ ఇండియా’ను ప్రోత్సహించడంలో భాగంగా కేంద్రం గుర్తించడంతో మరింత నమ్మకం ఏర్పడిందని చెప్పా రు. ప్రస్తుతం సంస్థకు హైదరాబాద్తోపాటు రాజస్థాన్లోని భీవాడి వద్ద తయారీ కేంద్రాలు ఉన్నాయి. ఈ రెండు యూనిట్లలో నెలకు 20 లక్షల స్మార్ట్ఫోన్లు, పది లక్షల ఎల్ఈడీ టీవీలను తయారు చేస్తున్నది.