న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ మంత్రి పార్థా ఛటర్జీని ఇవాళ ఈడీ అరెస్టు చేసింది. టీచర్ రిక్రూట్మెంట్ స్కామ్తో లింకున్న మనీల్యాండరింగ్ కేసులో మంత్రి పార్ధాను అరెస్టు చేశారు. మంత్రి పార్ధా సహాయకురాలు ఇంట్లో శుక్రవారం ఈడీ సుమారు 20 కోట్ల నగదును సీజ్ చేసిన విషయం తెలిసిందే. నిన్న రాత్రంతా పార్ధా ఛటర్జీని విచారించామని, అతన్ని ఈడీ ఆఫీసుకు తీసుకువచ్చినట్లు ఓ అధికారి తెలిపారు. ప్రస్తుతం పార్థా ఛటర్జీ బెంగాల్ పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రిగా ఉన్నారు. గతంలో ఆయన విద్యాశాఖ మంత్రిగా చేశారు. అయితే ఆయన విద్యాశాఖ మంంత్రిగా ఉన్న సమయంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో కుంభకోణం జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి.