Bengal Governor : రాజ్భవన్లో పనిచేసే ఓ మహిళా ఉద్యోగినిని లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పశ్చిమబెంగాల్ గవర్నర్ సీవీ ఆనందబోస్.. సిబ్బందికి సరికొత్త ఆదేశాలు జారీచేశారు. రాజభవన్లోపలికి పోలీసులను అనుమతించవద్దని ఆయన ఆర్డర్ వేశారు. అదేవిధంగా పశ్చిమబెంగాల్ ఆర్థిక మంత్రి చంద్రిమ భట్టాచార్యను కూడా రాజ్భవన్లోకి రానీయవద్దని గవర్నర్ తన ఆదేశాల్లో పేర్కొన్నారు.
ఉద్యోగంలో పదోన్నతి కల్పిస్తానని చెప్పి గవర్నర్ సీవీ ఆనందబోస్ తనను లైంగికంగా వేధించాడని రాజ్భవన్లో పనిచేసే ఓ మహిళ గురువారం మధ్యాహ్నం సంచలన ఆరోపణలు చేసింది. లోక్సభ ఎన్నికల వేళ గవర్నర్పై ఆరోపణలు రావడంతో తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి మంచి అస్త్రం దొరికనట్లయ్యింది. దాంతో టీఎంసీ నేతలు బీజేపీపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. అయితే, గవర్నర్ మాత్రం కొంతమంది రాజకీయంగా లబ్ధి పొందడం కోసం తనపై ఇలాంటి ఆరోపణలు చేయించారని ఆరోపించారు.