కటక్: దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీ తొలి మ్యాచ్ నెగ్గిన హైదరాబాద్ రెండో మ్యాచ్ ఆరంభంలోనే కష్టాల్లో పడింది. గ్రూప్ ‘బి’లో భాగంగా బెంగాల్తో గురువారం ప్రారంభమైన పోరులో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న హైదరాబాద్.. ప్రత్యర్థిని 242 పరుగులకు ఆలౌట్ చేసింది. అభిషేక్ బెనర్జీ (73) హాఫ్సెంచరీ నమోదు చేశాడు. లెఫ్టార్మ్ స్పిన్నర్ తనయ్ త్యాగరాజన్ 5 వికెట్లు పడగొట్టాడు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన హైదరాబాద్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్లు కోల్పోయి 15 పరుగులు చేసింది.