ఇన్స్పెక్టర్ నర్సింహస్వామి
నేరేడ్మెట్, నవంబర్ 20 : సెల్ఫోన్లలో వచ్చే అనవసర మెసేజ్లను ఓపెన్ చేయవద్దని నేరేడ్మెట్ ఇన్స్పెక్టర్ నర్సింహస్వామి తెలిపారు. శనివారం పోలీస్ స్టేషన్లో ఆయన మాట్లాడుతూ.. సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ఏ మాత్రం అప్రమత్తంగా లేకపోయినా ఖాతాలు ఖాళీ అవుతాయని అన్నారు. సైబర్ నేరగాళ్లు ఆన్లైన్ వేదికగా మోసాలకు పాల్పడుతున్నారని, ఉద్యోగాలు ఇప్పిస్తామని, లాటరీ వచ్చిందని, విలువైన గిఫ్ట్లు పంపిస్తున్నామని, తక్కువ ధరకు వస్తువులు అమ్మేస్తామంటూ.. నమ్మిస్తూ అమాయకులను నిండా ముంచేస్తున్నారని తెలిపారు. వారి పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలన్నారు. లింక్ మెసేజ్లు పెట్టి దోచేస్తున్నారని తెలిపారు. ఎవరైనా సైబర్ నేరగాళ్లబారినపడి డబ్బు పోగొట్టుకున్నవారు ఉంటే వెంటనే నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్కుగానీ డయల్ 100కుగానీ ఫిర్యాదు చేయాలన్నారు. అప్పుడే మీ డబ్బు తిరిగి రాబట్టేందుకు అవకాశం ఉంటుందని సీఐ తెలిపారు.