టోక్యో ఒలింపిక్స్లో పతకాలు సాధించిన భారత అథ్లెట్లను బీసీసీఐ సముచితంగా గౌరవించింది. ఐపీఎల్ 15వ సీజన్ ప్రారంభం సందర్భంగా శనివారం.. టోక్యో స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రాకు కోటి రూపాయల చెక్ను అందించిన బోర్డు.. కాంస్య పతక విజేత లవ్లీనా బోర్గొహైకి రూ. 25 లక్షలు ఇచ్చింది. కాంస్య పతకంతో మెరిసిన హాకీ జట్టుకు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ.. కోటి 25 లక్షల రూపాయల చెక్ అందించాడు.