హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వం బీసీ జనాభాను లెక్కించాల్సిందేనని డిగ్రీ కళాశాలల బీసీ లెక్షరర్స్ అసోసియేషన్, ఫూలే, అంబేద్కర్ ఆలోచన సమితి(పాస్) నేతలు డిమాండ్ చేశారు. సోమవారం వారు కూకట్పల్లిలో మాట్లాడుతూ.. కేంద్రం బీసీ జనాభాను లెక్కించకుంటే భవిష్యత్తులో సత్తా చూపుతామని హెచ్చరించారు. 27, 28 తేదీల్లో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి బీసీ యువజన సదస్సులో బీసీ జనాభాపై చర్చించనున్నట్టు వెల్లడించారు. అనంతరం సదస్సు బ్రోచర్ను విడుదల చేశారు. సమావేశంలో లెక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు వీ నందకుమార్, డాక్టర్ బాలశ్రీనివాస్, పాస్ అధ్యక్ష, కార్యదర్శులు మాలిక్, డాక్టర్ సత్యం తదితరులు
పాల్గొన్నారు.