అడిలైడ్: టీ20 వరల్డ్కప్ గ్రూప్ 2లో ఇవాళ బంగ్లాదేశ్, ఇండియా మధ్య మ్యాచ్ జరగనున్నది. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ కోసం బంగ్లాదేశ్ జట్టులో ఓ మార్పు జరిగింది. సౌమ్యా సర్కార్ స్థానంలో షోరిఫుల్ ఇస్లామ్ను తీసుకున్నారు. ఇండియా కూడా ఒక మార్పు చేసింది. దీపక్ హుడా స్థానంలో మళ్లీ అక్షర్ పటేల్ను తీసుకున్నారు. సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో దీపక్ ఆడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇండియా గ్రూప్ 2లో నాలుగు పాయింట్లతో రెండవ స్థానంలో ఉంది. బంగ్లాదేశ్ నాలుగు పాయింట్లతో మూడవ స్థానంలో ఉంది. ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకంకానున్నది.
🚨 Toss & Team Update from Adelaide 🚨
Bangladesh have elected to bowl against #TeamIndia. #T20WorldCup | #INDvBAN
Follow the match ▶️ https://t.co/Tspn2vo9dQ
1⃣ change to our Playing as @akshar2026 is named in the team 🔽 pic.twitter.com/eRhnlrJ1lf
— BCCI (@BCCI) November 2, 2022